Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-05-28 14:09:11
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- రాజస్థాన్లో సిగ్గుమాలిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన జోధ్పూర్ న్యూరో వార్డులో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన బయటపడింది. ఒక మహిళ MRI చేయించుకోవడానికి వెళ్ళింది. ఆ మహిళ దుస్తులు మార్చుకుంటుండగా, ఆమె చూపు గదిలో అమర్చిన ఒక రహస్య కెమెరా పడింది. ఈ సమాచారం తెలియగానే, మొత్తం ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం చెలరేగింది. ఈ విషయంలో సదరు మహిళ ఆసుపత్రి యాజమాన్యంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
జోధ్పూర్లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రి న్యూరో వార్డులో చేరిన మహిళకు MRI స్కాన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ మహిళను MRI ల్యాబ్కు పంపినప్పుడు, ఆమె బట్టలు మార్చుకుంటుండగా అక్కడ రహస్య కెమెరా అమర్చి ఉండవచ్చని అనుమానించింది. ఆ మహిళ చూసేసరికి, అక్కడ ఒక కెమెరా కనిపించింది. వెంటనే దీనిపై ఆసుపత్రి మేనేజర్కు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ గార్డు రహీముద్దీన్ అబ్బాసి తన మొబైల్ ఫోన్ను దుస్తులు మార్చుకునే గదిలో దాచిపెట్టాడని దర్యాప్తులో తేలింది.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై రహీముద్దీన్ను అరెస్టు చేశారు. ఇంతలో, ఆ మహిళ కుటుంబసభ్యులు శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరిగాయో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. ఇటువంటి సంఘటనలు మహిళల భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆ వీడియోను ఎందుకు తీశారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు సెక్యూరిటీ గార్డు గత రెండేళ్లుగా ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.