Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-05-28 14:16:01
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- బుధవారం మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణలోని చాలా ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్ & ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించాయి.
మంగళవారం నాటి ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం బుధవారం ఉదయం 0830 గంటలకుఅదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ తుఫాను ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది .
భారత ప్రాంతంపై దాదాపుగా 17° ఉత్తర అక్షాంశ ము వెంబడి ఉన్న గాలుల కోత లేదా షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 4.5 కి.మీ మధ్య ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంది.